Saturday, May 11, 2024

మహాశివరాత్రిరోజు తవ్వితే బంగారం దొరుకుంటుందట !!

నిజామాబాద్ జిల్లాలో గుప్త నిధుల వేట కలకలం రేపింది.సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ శివారులోని పురాతన కోటలో కొందరు తవ్వకాలు చేపట్టగా గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశారు.విద్యుత్ స్తంబానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు.దుబ్బాక గ్రామానికి చెందిన అంజయ్య మరో ఐదుగురి సహకారం తో ఈ తవ్వకాలు చేపట్టారు

.స్థానిక హనుమాన్ ఆలయం సమీపం లో ఉన్న కోటలో బంగారం నిల్వలు ఉన్నాయని మహా శివరాత్రి రోజున తవ్వితే అవి బయట పడతాయని నమ్మించి ఐదుగురు యువకులను సిద్ధం చేశాడు.గ్రామస్తులు గమనించి వారిని నిలదీశారు. గుప్తనిధుల కోసం వచ్చామని చెప్పడం తో వారిని గ్రామ కూడలి వద్ద బంధించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement