Saturday, May 18, 2024

చంటిబిడ్డ‌తో ఎగ్జామ్ రాయ‌డానికి వ‌చ్చిన త‌ల్లి-బిడ్డ‌ని లాలించిన హెడ్ కానిస్టేబుల్

ప‌ది రోజుల పాప‌తో కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయ‌డానికి కవిత అనే అభ్యర్థి మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహబూబ్ డిగ్రీ కాలేజీ సెంటర్ కి వచ్చింది. అసమయంలో ఆ పాప‌ని తన భర్తకు ఇచ్చి పరీక్ష రాయడానికి ఎగ్జామ్స్ హాల్ లోకి వెళ్ళింది. ఒక గంట తర్వాత పాప ఏడవడం మొదలుపెట్టింది .దాంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ స్వప్న లత వెంటనే పాపని తన ఒడిలోకి తీసుకొని లాలించి. ఆడిస్తూ ఓదార్చింది. పాప తల్లి ఎగ్జామ్స్ అయిపోయాక తన తల్లి ఒడిలోకి చేర్చింది. ఈ సంఘటనను పాప తల్లి కవితకు హెడ్ కానిస్టేబుల్ అయినా స్వప్న లత చెప్పింది. ఈ తెలుసుకున్న మార్కెట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరా రావు .. ఆడిషనల్ ఇన్ స్పెక్టర్ శేఖర్ .. SI లు..హెడ్ కానిస్టేబుల్ స్వప్నలత ను అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement