Monday, April 29, 2024

Harish Raoమంచి వైద్య సేవ‌లు అందించాలి

సిద్దిపేటలో శ్రీరామ హాస్పిటల్‌ను తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న జ్యోతిప్ర‌జ్వాల‌న చేసి ఆసుప‌త్రిని ప్రారంభించారు.

అనంత‌రం వార్డుల‌ను ప‌రిశీలించారు. ఆసుప‌త్రిలో అంద‌జేసే వైద్య సేవ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఆసుప‌త్రికి వ‌చ్చే రోగుల‌కు మంచి వైద్య సేవ‌లు అందించాల‌ని యాజ‌మని బూర విశ్వనాథంను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ కడవెర్గు రాజనర్సు, బిఆర్ఎస్ నాయకులు మోహిజ్ ముదిగొండ శ్రీనివాస్, శ్రీకాంత్, పయ్యావుల ఎల్లం, బందారం రాజు, పోడిశెట్టి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement