Friday, May 3, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీష్‌ చంద్ర శర్మ మొక్కలను నాటారు. మంగళవారం హైకోర్టు ప్రాంగణంలో ఏజీ బి.ఎస్‌. ప్రసాద్‌ ఆధ్వర్యంలో జరిగిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, అదనపు ఏజీ జె. రామచందర్‌ రావులతో కలిసి సిజె సతీష్‌ చంద్రశర్మ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా సిజె సతీష్‌ చంద్ర శర్మ సహా ఇతర న్యాయమూర్తులకు వృక్ష వేదం గ్రంధాన్ని ఎంపీ సంతోష్‌ కుమార్‌ బహుకరించారు. అనంతరం సిజె సతీష్‌ చంద్ర శర్మ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చినట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ లాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు.

ఇలాంటి మంచి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంపీ సంతోష్‌ కుమార్‌ సేవలను ఆయన ప్రశంసించారు. అనంతరం ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హైకోర్టు ప్రాంగణంలోని తాను జన్మించిన అప్పటి పాత ప్రభుత్వ జజిఖాన్‌ ప్రసూతి ఆసుపత్రి ఆవరణలో సిజె సతీష్‌ చంద్ర శర్మ, ఇతర న్యాయమూర్తిలతో కలిసి మొక్కలను నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, జస్టిల్‌ పి. నవీన్‌ రావు, జస్టిస్‌ జి. శ్రీదేవి, జస్టిస్‌ శ్రీ సుధ, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ. నరసింహ రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌ గౌడ్‌, బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కళ్యాణ్‌ రావు, జీపీలు జోగినపల్లి సాయి కృష్ణ, సంతోష్‌ కుమార్‌, ఫుడ్‌ కమిషన్‌ సభ్యుడు గోవర్ధన్‌ రెడ్డి, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఫౌండర్‌ రాఘవ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement