Sunday, April 28, 2024

TS : 17న సెల‌వు ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం

ఈనెల 17న శ్రీరామనవమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ రోజు రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా విద్యాసంస్థలు కూడా పూర్తిగా బంద్ కానున్నాయి.

- Advertisement -

నగరంలో శోభాయాత్ర..
మరోవైపు శ్రీరామ నవమి శోభాయాత్రను పురస్కరించుకుని నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ శోభయాత్ర కోసం సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలోని ధూల్ పేటలోని ఆకాశపురి హనుమాన్ దేవాలయం నుంచి భారీ ఊరేగింపును విజయవంతం చేసేందుకు స్వచ్ఛంద సభను ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దీంతో రాజాసింగ్ యాత్ర సాగే ఆ మార్గాల్లో పోలీసులు ప్ర‌త్యేక పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు.. శోభ‌యాత్ర దారిపోడువునా భారీగా పోలీసులు మోహ‌రిస్తున్నారు.. అలాగే ఆ రోజు ప‌లు ప్రాంతాల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌లు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement