Sunday, April 28, 2024

AP: జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలో చేరిన‌ ప‌లువురు కీల‌క నేత‌లు..

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర కొన‌సాగిస్తున్నారు. అయితే ఇవాళ ఉద‌యం కేసరిపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల‌ నుంచి జగన్‌ సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో కీల‌క నేత‌లు చేరారు.

నందిగామ మార్కెటింగ్‌ కమిటీ మాజీ చైర్మన్, 3 దశాబ్దాలుగా టీడీపీ కీలకనేత చిరుమామిళ్ల శ్రీనివాసరావు(అలియాస్‌ బుజ్జి), నందిగామ పట్టణ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ వడ్డెలి శ్రీనివాసరావు, నందిగామ మున్సిపల్‌ టీడీపీ కీలక నేత వై రామారావు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గోడపాటి బాబూరావు, టీడీపీ ఎన్టీఆర్‌ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్‌ కరీముల్లా, టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ షేక్‌ హసీనా, టీడీపీ సీనియర్‌ నేత కొమ్ము విజయరాజులు వైసీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని నాని, నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement