Friday, May 3, 2024

అర్హులైన అందరికీ ప్రభుత్వ పథకాలు : కేపీ వివేకానంద్

పైరవీలు, దళారుల మోసాలకు తావు లేకుండా అర్హులైన వారి ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ అన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధికి చెందిన 107 మంది ముఖ్యమంత్రి సహాయనిధి పథకం లబ్ధిదారులకు రూ.61.50ల‌క్ష‌ల‌ విలువ గల చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు క్యాంపు కార్యాలయంలో ఆయ‌న‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.

నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం వరం లాంటిదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. నిరుపేదలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారి మేలు కోసం సీఎం కేసీఆర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా అండగా నిలుస్తున్నారన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసి నిధులను మంజూరు చేస్తుందన్నారు.ఈ సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement