Thursday, May 2, 2024

MDK: మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి :మంత్రి హరీష్ రావు

కంది, సెప్టెంబర్ 16(ప్రభ న్యూస్) : మత్స్యకారులు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. చిమ్నపూర్ చెరువులో 72వేల చేప పిల్లలను శనివారం కార్యకర్తలతో కలిసి మంత్రి హరీష్ రావు వదిలారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పెద్దగా జల వనరులే లేని తెలంగాణ ప్రాతంలో చేపలెక్కడ ఉత్పత్తి అవుతాయని ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చులకనచేసి మాట్లాడిన నాటి పాలకుల కళ్ళు బైర్లుగమ్మే విధంగా కేసీఆర్‌ సర్కారు మత్స్య రంగాన్ని అభివృద్ధి చేసి చూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో కంది మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement