Sunday, April 28, 2024

Gadwal – ప్రేమ పేరుతో మోసం … విద్యుత్ కార్యాల‌యం ముందు యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ..

జోగులాంబ గద్వాల (ప్రతినిధి) సెప్టెంబర్ 23 (ప్రభ న్యూస్) – జోగులాంబ గద్వాల జిల్లా: ఎఈ ప్రేమించి మోసం చేశాడ‌ని ఆరోపిస్తూ ప్రభావతి గద్వాల ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..రాజోలి మండలము, పెద్దదన్వాడ గ్రామానికి చెందిన ప్రభావతి బీటెక్ విద్యార్థి, ఈమె ఇటిక్యాల మండలము, ఉదండాపురం గ్రామానికి చెందిన అజిత్ కుమార్ గద్వాల ఎలక్ట్రిసిటీ ఏఈగా పనిచేస్తున్న ఇతన్ని ప్రేమించింది. వారు ఇద్దరు ప్రేమ వ్యవహారం మూడున్నర సంవత్సరాలుగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వీరిద్దరూ ప్రేమించుకున్న సమయంలో ప్రభావతిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి అన్ని విధాలుగా శారీరకంగా వాడుకుని ఇప్పుడు తీరా మొఖం చాటు వేశాడని, ఈ మధ్యకాలంలో మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్లు ప్రభావతి తెలిపింది. ప్రేమించుకున్న సమయంలో నిన్నే పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకున్నాడని ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నిన్ను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేనేజ్ చేసుకుని నీకు అంతో ఇంతో డబ్బులు ఇస్తానని నిన్ను మాత్రం పెళ్లి చేసుకోనని అజిత్ ఏఈ అన్నట్లు ప్రభావతి తెలిపింది. త‌న‌ను ప్రేమించి శారీరకంగా వాడుకున్న అజిత్ నే నేను పెళ్లి చేసుకుంటానని . త‌న‌కు త‌గిన న్యాయం చేయాలని కోరుతుంది ప్రభావతి.

గద్వాల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్యాలయం ముందు ప్రభావతి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ప్రభావతిని హాస్పిటల్ నుంచి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం ప్రభావతి టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై విషయంపై గద్వాల టౌన్ ఎస్ఐ కు వివరణ కోరగా.. ప్రభావతి పోలీస్ స్టేషన్ కు తీసుకు రాలేదని హాస్పిటల్ కు తీసుకెళ్లారని పూర్తి విచారణ చేస్తున్నామని ఎవరిపై ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement