Friday, May 3, 2024

హనుమాన్ మందిర్ కు నిధులు మంజూరు చేయాలి… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి వినతి

జైనూర్, జూలై 4 (ప్రభన్యూస్) : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)మండలంలోని బాండేర్ పంచాయతీ కేంద్రంలో హనుమాన్ మందిర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వీటీడీఏ ప్రెసిడెంట్ కుమ్ర భీమ్రావు, సర్పంచ్ గంగాదేవి, గ్రామస్తులు మంగళవారం దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు బండేర్ వి టి డి ఏ ప్రెసిడెంట్ కుమ్ర భీమ్రావు తెలిపారు.

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేసి, నిధులు లేక నిరుపయోగంగా ఉన్న హనుమాన్ మందిర్ నిర్మాణానికి దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం ఇవ్వగా.. మంత్రి నిధులు మంజూరుకు హామీ ఇస్తూ రాసి ఇచ్చారని ఆయన తెలిపారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పందించి హామీ ఇవ్వడంతో కృతజ్ఞతలు తెలిపారు. కలిసిన వారిలో బండేర్ గ్రామ పటేల్ తొడసం ప్రవీణ్ కుమార్, ఈగ భీమరావు తొడసం మహదు, తోడసం నాగోరావ్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement