Friday, May 10, 2024

లక్ష్మీపూర్‌ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కడెం నదిపై లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం నిర్మాణానికి నిధులు విడుదల చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఎత్తిపోతల నిర్మల్‌జిల్లా కడెం మండలంలో లక్ష్మీపూర్‌ ఎత్తిపోతలను నిర్మించేందుకు రూ.40కోట్లను మంజూరు చేసింది.

ఈ పథకం ద్వారా 0.23 టీఎంసీలను ఎత్తిపోసి ఆయకట్టుకు అందించనున్నారు. విడుదల చేసిన నిధులను అంచనాల ప్రకారం ఖర్చు చేయాలని ఆదిలాబాద్‌ చీఫ్‌ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అవసరమైన అన్ని అనుమతులను తీసుకోవాలని ఆదేశించారు. సాంకేతిక అనుమతులు సాధించే బాద్యత ఆదిలాబాద్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌దేనని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement