Saturday, May 18, 2024

నేటినుంచి ఎన్‌టిఆర్ స్టేడియంలో కోటి దిపోత్స‌వం

కార్తీక మాసాన్ని పుర‌స్క‌రించుకుని న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియం వేదిక‌గా నేటి నుంచి రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో భక్తి టీవీ ఆధ్వ‌ర్యంలో కోటి దిపోత్స‌వంను 12 నుంచి 22 వరకు వైభ‌వంగా నిర్వ‌హించ‌నుంది. ప్రతీ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు దీపోత్సవం ప్రారంభమవుతుంది.

ఈ ఉత్సవంలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ, శ్రీత్రిదండి శ్రీమన్నారయణ చిన్నజీయర్‌స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర, ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ, కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానందభారతి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి తదితర ప్రసిద్ధ గురువులతో పాటు ప్రవచన కర్తలు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ, గరికిపాటి నరసింహారావులు పాల్గొంటారు. ప్రతీ రోజు భక్తులు స్వయంగా విశేష పూజలు నిర్వహించుకునే విధంగా కార్యక్రమం జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement