Thursday, May 2, 2024

TS: మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు..!

తెలంగాణ‌ మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్‌కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్‌లను కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో శ్రీనివాస్ గౌడ్ పిటిషన్ వేశారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. ఆయన అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది.

ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. శ్రీనివాస్ గౌడ్‌కు గన్ మెన్‌లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు మార్చి 19 కి వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement