Thursday, May 16, 2024

RR : ఎడ్ల బండి పై ప్ర‌చారం నిర్వ‌హించిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్

వికారాబాద్, నవంబర్ 27 (ప్రభ న్యూస్): రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని మాజీ మంత్రి, వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాజీ గ్రంథాల సంస్థ చైర్మన్ సనగాని కొండల్ రెడ్డి సీనియర్ నాయకులు సుభాష్ యాదవ్ తో కలిసి ఆయన ఎడ్లబడ్డెక్కి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని అన్నారు. 1200 మంది ప్రాణాలు రుపించి తెలంగాణ సాధిస్తే కేవలం కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప ఏ ఒక్క తెలంగాణ వాది బాగుపడలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రతి ఉద్యమకారునికి 250 గజాల స్థలాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. బంగారు తెలంగాణ చేస్తామన్న కేసీఆర్ తమ కుటుంబాన్ని బంగారు మాయం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాబోయే రోజుల్లో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ లతోపాటు ప్రతి పెళ్లి అయ్యే కుటుంబానికి తులం బంగారం అందజేస్తామని ఆయన పేరుకున్నారు. మాజీ జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి మాట్లాడుతూ ఈ శాసనసభ ఎన్నికల లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీమంత్రి ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మండపేట అధ్యక్షుడు భూచన్పల్లి రవీందర్, నాయకులు సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement