Friday, May 3, 2024

Modi: తిరుమల నుంచి హైదరాబాద్ కు మోడీ పయనం..

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం దగ్గర టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయక మంటపంలో వేద పండితులు వేధ ఆశీర్వచనం ఇవ్వగా, టీటీడీ చైర్మన్, ఈఓలు స్వామి వారి చిత్ర పటాన్ని బహుకరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

తిరుమల పర్యటన అనంతరం తిరుగు పయనమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సాదర వీడ్కోలు పలికారు. ప్రధానికి సాదర వీడ్కోలు పలికిన వారిలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్.జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి, జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement