Thursday, May 9, 2024

AP : అది ‘యువ‌గ‌ళం’ కాదు ‘హాస్య‌గ‌ళం’… హాయిగా నవ్వుకోండి…అంబ‌టి రాంబాబు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం మలివిడత పాదయాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 9న నారా లోకేశ్ యువగళం పాదయాత్రను ఆపివేశారు.

అనంతరం చంద్రబాబు బెయిల్ ఇతర వ్యవహారాల నిమిత్తం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. అనంతరం చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుకావడంతో ఇక లోకేష్ యువగళం పాదయాత్ర డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచి మలివిడత పాదయాత్ర పున: ప్రారంభమైంది. ఈ యువగళం పాదయాత్ర పున: ప్రారంభం సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఎక్స్ వేదికగా మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.’ప్రారంభమయిన ”హాస్యగళం”విని, చూసి…….. నవ్వుకోండి !’ అని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement