Friday, May 17, 2024

TS: ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు.. రూ.6లక్షలు స్వాధీనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలో‌ని, అదర్శ్ నగర్ లోని వేణు రెస్టారెంట్ వద్ద అరు లక్షల రూపాయలను ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

ముద్రగడ్డ శ్రీనువాస్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా అరు లక్షల రూపాయలను తీసుకువెళ్తుండగా, విశ్వసనీయ సమాచారం మేరకు అతని వద్ద ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీ నిర్వహించగా పట్టుకున్నారు. నగదును సీజ్ చేశామని తెలిపారు. ఈ తనిఖీలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి నరేష్, మణుగూరు ఎస్ఐ శ్రీను, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement