Sunday, April 28, 2024

గంగారం జేపీ సినిమాస్ లో అగ్నిప్రమాదం – మూడు స్క్రీన్ లు ఆహుతి

హైదరాబాద్ లో వరుసగా అగ్నిప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నగరంలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చందానగర్ లోని గంగారం జేపీ సినిమాస్ లో మంటలు చేలరేగాయి.. శనివారం తెల్లారుజామున జాతీయ రహదారికి అనుకొని ఉన్న తపాడియా మారుతిమాల్ లో ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. మొదట ఒక్కసారిగా మంటలు చెలరేగటంతో దట్టమైన పొగలు అలుముకొన్నాయి. 5వ అంతస్తు వరకు మంటలు వ్యాపించడంతో మల్టీ ఫ్లెక్స్ సినిమా హాల్ లోని ఐదు స్క్రీన్ లలో 3 పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. వెంటనే డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలు వేరే అంతస్తులోకి వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు.

మాల్ లో మంటలు ఎందుకు చెలరేగాయో.. షార్ట్ సర్క్యూట్ కారణమా.. ఇంకేదైనా ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. భారీ ఆస్తి నష్టం కలిగినట్లు తేలుతున్నది.ఈ మాల్ ను ఇటీవలే ప్రారంభించగా.. కొన్ని షాప్స్ పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. అయితే శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైద్యాధికారి కార్తీక్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement