Thursday, May 9, 2024

దూదేకులపల్లిలో దారుణం – కన్నతండ్రిని చంపిన కసాయి కొడుకు

భూపాలపల్లి ప్రతినిధి( ప్రభ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం దుదేకులపల్లి గ్రామంలో ఆదివారం దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కన్నతండ్రిని చంపి మృతదేహాన్ని మూట కట్టి మూడు రోజుల పాటు ఇంట్లో దాచి ఉంచి ఆదివారం ఉదయం గ్రామ సమీపంలో నీ ఊర చేరువలో పడేసిన కసాయి కొడుకు. సాదారణ మరణంగా చిత్రీకరించబోయి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.

గత కొద్దిరోజులుగా ఇంటిలో తండ్రి గుమ్మడి తిరుపతితో కొడుకు ధనుంజయ తరచు గొడవపడుతుండేవాడు. తల్లి చనిపోవడంతో ఇంటిలో ఇద్దరే ఉండేవారు. మూడు రోజుల క్రితం గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు మృతదేహాన్ని ఇంటిలోనే మూటకట్టి వుంచాడు. గ్రామంలో తన తండ్రి వేరే ఊరికి వెళ్ళాడని గ్రామస్థులతో నమ్మబలికాడు. మూడు రోజులు కావటంతో ఇంట్లో దుర్వాసన వస్తుండటంతో తెల్లవారు జామున మృతదేహాన్ని దుప్పటిలో మూటకట్టుకొని స్కూటీపై తీసుకెళ్లి ఊర చెరువులో పడేశాడు. ఇదంతా గమనించిన గ్రామస్తులు కొడుకు ధనంజయ ను పట్టుకుని నిలదీయడంతో తండ్రికి తనకు జరిగిన గొడవలో చంపేశానని తెలిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement