Sunday, May 19, 2024

పెద్దమడూరు వాగులో చిక్కుకున్న రైతులు.. పోలీసుల సాయంతో ఒడ్డుకు చేర్చిన గ్రామ‌స్తులు

జనగామ జిల్లాలోని పెద్దమడూరు వాగులో నలుగురు రైతులు చిక్కుకుపోయారు. వారిని ఇవ్వాల (శుక్రవారం) రాత్రి పోలీసులు సాయంతో గ్రామస్తులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో చౌడబోయిన యాదగిరి, బోనగిరి పెద్దులు, అంతటి యాకన్న, అంతటి సోమన్నగా గుర్తించారు. కాగా, వీరు పెద్దమడూర్ వాగు అవతలి ఓడ్డుకు వెళ్లి పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వ‌స్తున్న క్ర‌మంలో వాగు ఉధృతి పెర‌గ‌డంతో అక్క‌డే చిక్కుకుపోయారు. దీంతో స‌పీమ గ్రామస్తులలో ఒకరు ధైర్యం చేసి తాడు కట్టుకొని వారి వద్దకు వెళ్లి ఒక్కొక్కరిగా ఇవ‌త‌లి ఒడ్డుకు తీసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement