Friday, April 26, 2024

ఫామ్ హౌస్ కేసు.. నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టివేత

తెలంగాణ రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఫామ్ హౌస్ ప్రలోభాల కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ లను కస్టడీకి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో మరోసారి కస్టడీకి ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేసింది. సిట్ వేసిన పిల్ ను తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. గతంలో నిందితులను రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement