Monday, April 29, 2024

త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్న సీఎం కేసీఆర్ : కిష‌న్ రెడ్డి

సీఎం కేసీఆర్ త‌ప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి అన్నారు. ఇవాళ‌ కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ… హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి అనంతరం.. రెండు రోజుల తర్వాత సీఎం కేసీఆర్ ఈ ధాన్యం కొనుగోలు అంశాన్ని లేవనేత్తార‌న్నారు. అంతకు ముందు ఈ విషయం సీఎంకు తెలియదా అంటూ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన మొదట్లో రూ. 3400 కోట్లతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుతం.. రూ. 26,600 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని ఇది రైతులను మోసం చేయడమేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు.
సీఎం కేసీఆర్ తన వైఫల్యాలను, తప్పిదాల నుంచి కప్పి పుచ్చుకోవడాని ఏదో ఒక కొత్త అంశం లేవనెత్తుతూ ప్రజలను ఆగం పట్టిస్తున్నారన్నారు. గతంలో తెలంగాణకు నాలుగు సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినా.. ధాన్యాన్ని సేకరించలేదన్నారు. మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని కేంద్రానికి ఎందుకు లేఖ రాశారని నిలదీశారు. భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ రాసింది మీరు కాదా అంటూ కిష‌న్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement