Sunday, March 24, 2024

WGL | జనగామ జిల్లాలో నకిలీ సీడ్స్​ కలకలం.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు

జనగామ జిల్లాలో నకిలీ సీడ్స్​ కలకలం చెలరేగింది. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో కొన్ని రోజుల నుంచి నకిలీ సీడ్స్​ తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న ఏడీ పరుశురాం నాయక్, ఏఓ రాజు, ఏఈఓ సాగర్, పోలీస్ సిబ్బందితో కలిసి ఇవ్వాల (శుక్రవారం) దాడులు జరిపారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఏడీ పరుశురాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా నుంచి ఇద్దరు వ్యక్తులు ఎలాంటి బిల్లులు, ప్యాకెట్ లేని నకిలీ విత్త‌నాలు తెచ్చి విడిగా అమ్ముతున్నారనే విషయం స్థానికుల ద్వారా తెలిసింద‌న్నారు. దీంతో ఆ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేశామన్నారు. ఈ క్రమంలో యాదగిరి, రామారావు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా వారి నుంచి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని, ఆ విత్తనాలను ల్యాబ్ కు పంపించి తదుపరి విచారణ చేపట్టినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement