Friday, May 10, 2024

Eye Hospitals – దీపావ‌ళి టపాసులు ఎఫెక్ట్ … భాగ్య‌న‌గ‌రంలో కిట‌కిట‌లాడుతున్న కంటి హాస్ప‌ట‌ల్స్

హైద‌రాబాద్ – దీపావళి వేడుకల్లో మహానగర వ్యాప్తంగా పలు చోట్ల‌ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.. చిక్క‌డ‌ప‌ల్లిలో చీర‌కు నిప్పంటుకున్న భార్య‌ను ర‌క్షించ‌బోయిన భ‌ర్త ఆ మండ‌ల‌లో కాలి మృతి చెందాడు.. భార్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది..ఇక ప‌లు ప్రాంతాల‌లో అగ్నిప్ర‌మాదాలు జ‌రిగినా కొద్దిపాటి ఆస్తి న‌ష్టం మాత్రం వాటిల్లింది.. అయితే దీపావ‌ళి ప‌టా రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు దాదాపు 80 మందికి పైగా బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో పెద్దలు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఒక్క సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలోనే 8 మంది చెరితే.. ఇక ప్రైవేటు హాస్ప‌ట‌ల్స్ చికిత్స పొందుతున్న వారి సంఖ్య ప‌దింత‌లు ఉన్నాయి. కంటి గాయాల‌తో వ‌చ్చిన వారిని ప‌రీక్షించి వైద్యులు చికిత్స అందించి పంపివేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement