Saturday, April 27, 2024

కాంగ్రెస్ నుంచి మ‌ర్రి శ‌శధ‌ర్ రెడ్డి బ‌హిష్క‌ర‌ణ..

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై, రేవంత్ రెడ్డిపై సీనియ‌ర్ నేత‌ మర్రి శ‌శిధ‌ర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఆరేళ్ల పాటు మర్రి శశిధర్ రెడ్డిని పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని మర్రి శశిధర్ రెడ్డిపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. బీజేపీ నాయకులతో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కించపరిచేలా మాట్లాడటంపై కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement