Friday, March 29, 2024

కాళీ తమిళ సంగమంకోసం.. పంచెక‌ట్టులో మెరిసిన ప్ర‌ధాని మోడీ

ప్ర‌ధాని మోడీ సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టుగా డ్రెస్సింగ్ చేసుకుంటుంటారు. దాంతో ప్ర‌తిప‌క్ష నేత‌లు మోడీ డ్రెస్సింగ్ పై ప‌లుమార్లు సెటైర్లు వేశారు.అయినా స‌రే త‌న ప‌ద్ద‌తిని మార్చుకోలేదు మోడీ. తాజాగా మోడీ పంచెకట్టు కనిపించి అందరినీ మెస్మరైజ్ చేశారు. పంచెకట్టులోనూ తనకు సాటి ఎవరూ లేరు అనేలా మోడీ స్పెషల్ గా కనిపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్యూ)లో కాళీ తమిళ సంగమం జరుగుతోంది. దేశంలో పురాతనమైన తమిళనాడు.. కాళీ మధ్య సంబంధాలను మరింత బలపరిచేలా కాళీ తమిళ సంగమం కార్యక్రమాలు కేంద్రం నిర్వహిస్తోంది ఈ కార్యక్రమానికి మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యేందుకు వారణాసికి వెళ్లారు. విమానం నుంచి దిగుతూనే పంచెకట్టులో స్పెషల్ గా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement