Friday, April 26, 2024

ప్రాజెక్ట్-K కోసం.. 40కోట్లతో నాలుగు సెట్స్

ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ మూడు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. వాటిల్లో ఒకటి ప్రాజెక్ట్ -K . నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. అమితాబ్‌బచ్చన్‌ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తుంది. దీపికాకు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ లుక్‌ పోస్టర్‌లు సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో ఫైట్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ షెడ్యూల్‌ కోసం దాదాపు నలభై కోట్లతో నాలుగు సెట్స్‌లను మేకర్స్ రూపొందించినట్లు టాక్. ఈ సెట్స్‌లలో భారీ స్థాయిలో పోరాట సన్నివేశాలు చిత్రీకరించినున్నారట. దీనికోసం పలువురు హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్‌లు రంగంలోకి దిగనున్నారట. సై-ఫై థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వినీ దత్‌ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement