Sunday, April 28, 2024

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి.

కొడంగల్: ప్రభాన్యూస్ – ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో నియోజకవర్గ సీనియర్ నాయకులు కొస్గి మండలం టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్న కిష్టప్ప, మద్దూరు మండలం మాజీ జెడ్పిటిసి , మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ రెడ్డి, బొమ్మరిస్పెట్ మండలం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సీసీ వెంకటయ్య, TPCC రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వార్ల విజయకుమార్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement