Saturday, May 4, 2024

TS : కెసిఆర్ సభకు సర్వం సిద్ధం.. పెద్దపల్లిలో 3 గంటలకు

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. బహిరంగ సభ జరిగే జూనియర్ కళాశాల మైదానం గులాబీ జెండాలు, తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగ్లతో ముస్తాబయింది.

మధ్యాహ్నం మూడు గంటలకు జూనియర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు కేసీఆర్ సభకు హాజరుకాన్నారు. ఏర్పాట్లను పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement