Monday, May 6, 2024

గ్రీన్ ఇండియా చాలెంజ్‌ని అంద‌రూ స్వీక‌రించాలి.. మేయ‌ర్‌తో క‌లిసి మొక్కలు నాటిన కేకే..

టీఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె. కేశవరావు బంజారాహిల్స్ లోని తన నివాసంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కే.కేశవరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎలా అయితే పాల్గొన్నారో తెలంగాణ అభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజున కానీ, పండుగ రోజు గాని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

వాతావరణ మార్పులను అరికట్టేందుకు చెట్లు ఎంతో తోడ్పడతాయి అని అన్నారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు కేకే. త‌న‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కేకే ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, టీఆరెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement