Thursday, May 2, 2024

RR: విద్యుత్ బిల్లు వివాదం.. కొడుకు చేతిలో తండ్రి హతం..

వికారాబాద్, ఆగస్టు 29 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండలం అత్తిలి గ్రామంలో కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. వికారాబాద్ టౌన్ సిఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాలు ప్రకారం.. అత్తిలి గ్రామంలో ఎకమామిడి రామచంద్రయ్య (58)ను తన కొడుకు యాదయ్య కొట్టి చంపాడు.

తన తండ్రితో ఇంటి కరెంటు బిల్లు కట్టే విషయంలో గొడవపడ్డారు. కోపంతో తన తండ్రిని చంపాలనే ఉద్దేశంతో ఒక ఇనుప రాడ్డుతో తల వెనుక వైపు బలంగా కొట్టగా, తీవ్ర రక్తస్రావం కాగా గ్రామస్తులు చికిత్స నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడ డాక్టర్లు చూసి చనిపోయాడని తెలిపారు. మృతుడు రామచంద్రయ్యను తన కొడుకు యాదయ్య ఇంటి కరెంటు బిల్లు విషయంలో గొడవపడి రాడ్డుతో కొట్టి చంపాడు. మృతుని తమ్ముని కొడుకు లాలయ్య ఫిర్యాదు చేయగా.. వికారాబాద్ ఇన్ స్పెక్టర్ టంగుటూరి శ్రీను కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement