Thursday, May 2, 2024

Election Meeting – 7న బీజేపి – జనసేనల ప్రచారసభ – హాజరు కానున్న మోడీ , పవన్ కల్యాణ్

హైదరాబాద్ – తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో బీజేపీ తన వ్యూహాలకు మరింత పదునుపెట్టింది. తెలంగాణలో జనసేనతో పొత్తు కోసం ప్రయత్నించిన బీజేపీ ఆ దిశగా దూకుడుగా వ్యవహారించింది. దీనిలో భాగంగానే జనసేన అధినేత పనవ్ కల్యాణ్ తో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గత రాత్రి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పవన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా చైర్మన్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పొత్తుతోపాటుగా, సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోగా…పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు

పవన్ కల్యాణ్ ఏమన్నారంటే:-

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించాం.-ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశాం.-సుహృధ్బావంగా ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చిస్తున్నాం.-మేము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయి.-రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉంది మరోసారి బిటి అవుతాం.-మా పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ c ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారు.-నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలి .-ఇటీవల జరిగిన ఎన్డీయే మీటింగ్ లో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడాము.-ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ. పాల్గొంటారు.-మోడీ హాజరు అయ్యే సభకు నన్ను ఆహ్వానించారు. ఈ సభలో పాల్గొంటాను

Advertisement

తాజా వార్తలు

Advertisement