Sunday, April 28, 2024

TS: 22న ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ..

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : లోకసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. గురువారం నుండి ఎన్నికల నోటిఫికేషన్ మొదలవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదిలాబాద్ నుండే ఎన్నికల శంఖారావం పూరించగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 22న జరిగే ఎన్నికల రణభేరికి ఆదిలాబాద్ నుండి శంఖారావo పూరించనున్నారు.

అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థి సుగుణ తొలిసెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార సభలను నిర్వహించగా 22న సీఎం రేవంత్ రెడ్డి సభతో ఎన్నికల వాతావరణo వేడెక్కనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement