Sunday, April 28, 2024

విద్యతోనే బంగారు భవితకు బాటలు : ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

తాండూర్ ఏప్రిల్ 12 (ప్రభ న్యూస్) : విద్యతోనే బంగారు భవితకు బాటలు వేసుకోవాలని బెల్లంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని రేచిని గ్రామంలో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ఆధునికరించిన పాఠశాల భవనాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని చదువులో ఉన్నతంగా రాణించాలని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పూసల ప్రణయ్ కుమార్ జడ్పిటిసి, శాలిగాం బానయ్య, సర్పంచ్ దుర్గు బాయ్ ఉపసర్పంచ్ నరిగే రాజయ్య సింగిల్ విండో చైర్మన్ సుబ్బా దత్త మూర్తి, ఎంపీటీసీ మొగిలి శంకర్ ఏఎంసి డైరెక్టర్ గట్టు సంతోష్ కుమార్ ,ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంఈఓ ప్రభాకర్ నాయకులు పురుషోత్తం గౌడ్, శ్రీనివాస్, శంకర్ సత్యనారాయణతదతరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement