Thursday, May 2, 2024

Nomination Filed రాక్ష‌స‌పాల‌న అంతంచేసేందుకే గ‌జ్వేల్ నుంచి పోటీ – ఈట‌ల రాజేంద‌ర్

గ‌జ్వేల్ లో తాను గెలిస్తే తెలంగాణ ఆత్మ‌గౌర‌వం నిల‌బ‌డుతుంద‌ని గజ్వేల్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు.. కెసిఆర్ ఆహంకారాన్ని గ‌జ్వేల్ ప్ర‌జ‌లు ఓట్ల ద్వారా అణిచివేయాల‌ని పిలుపు ఇచ్చారు..గజ్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఈటల రాజేందర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ…ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఈ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ లో చేరినట్లు గుర్తు చేశారు. గజ్వేల్‌కు కేసీఆర్ పరాయి వ్యక్తి అని, తాను కాదన్నారు.
రాక్షసపాలన పోవాలంటే గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు కోరారు అన్నారు. గజ్వేల్ రమ్మని ఇక్కడి ప్రజలు హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కోరారు అన్నారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ప్రధాని మోడీ సొంత నియోజకవర్గమైన వారణాసి నెలనెలా వెళ్లి అక్కడి ప్రజల బాగోగులు పట్టించుకుంటారని, కానీ కేసీఆర్ మాత్రం గజ్వేల్ ను ఎప్పుడు పట్టించుకో లేదన్నారు. గజ్వేల్ ప్రజలను ఎన్నడూ కూడా కేసీఆర్ కలవరు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement