Monday, April 29, 2024

Breaking: ఎల్బీనగర్ లో మందుబాబుల వీరంగం.. మద్యం తాగొద్దన్నవారిపై దాడి

హైదరాబాద్ ఎల్బీ నగర్  లో దారుణం జరిగింది. కేకే గార్డెన్ దగ్గర మందుబాబులు వీరంగం సృష్టించారు. బహిరంగ ప్రదేశంలో మద్యం తాగొద్దన్నవారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నర్సింహారెడ్డి అనే యువకుడు మృతి చెందాడు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితులు పరారీలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement