Wednesday, May 1, 2024

Drug Case: చుక్కలు చూపిస్తున్న నిందితులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎక్సైజ్‌ శాఖకు నిందితులు చుక్కలు చూపిస్తున్నారు. డ్రగ్స్ కేసులో 12 ఛార్జ్‌షీట్‌లను ఎక్సైజ్‌శాఖ దాఖలు చేసింది. అయితే, కోర్టుల విచారణకు నిందితులు డుమ్మా కొట్టారు. 2019 నుంచి నిందితుడు సంతోష్ దీపక్ అదృశ్యం కాగా..2020 నుంచి కోర్టుకు కెల్విన్ హాజరుకాలేదు. మూడుసార్లు నోటీసులిచ్చినా కెల్విన్ కోర్టుకు హాజరుకాలేదు. ఇక మరో నిందితుడు అబూబకర్ 2018 నుంచి కోర్టుకు రాలేదు. నిందితులు హాజరుకాకపోవడంతో డ్రగ్స్ కేసు విచారణ ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.

ఇది కూడా చదవండి: దేశంలో 84 కోట్లు దాటిన వ్యాక్సినేషన్.. కొత్త కేసులు ఎన్నంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement