Monday, April 29, 2024

కిమ్స్ వైద్యులకు గ్రీన్ ఇండియా చాలెంజ్

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ GHMC పార్క్ లో కిమ్స్ హాస్పిటల్ వైద్యులు డా.హిమ దీప్తి,డా.పూర్ణిమ తమ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.హిమదీప్తి,డా.పూర్ణిమ మాట్లాడుతూ ఎంపీ.సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే తరాలకు మంచి పర్యవరణాన్ని అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలిపారు. పిల్లల్లో కూడా మొక్కల గురించి అవగాహన కల్పించేందుకు ఈరోజు తమ పిల్లలను కూడా ఇందులో భాగస్వామ్యం చేశామని ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఇరువురు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం డా.ప్రియ భారతి,డా.చరణ్ కి డా.పూర్ణిమ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసరగా డా.హిమదీప్తి మరో ఇద్దరు రవి,డా.మనీషా సహాయ్ ఇద్దరికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement