Wednesday, May 1, 2024

WGL : కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు….బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి, మంత్రి సత్యవతి రాథోడ్

జనగామ, నవంబర్ 13(ప్రభ న్యూస్): రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని ఓర్చుకోలేని ప్రతిపక్షపార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఊసరవెల్లి రంగులు మారుస్తూ మాయమాటలు చెబుతున్నారని ప్రజలు ఎవరు నమ్మరని అలాంటి పార్టీని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని మంత్రి సత్యవతి రాథోడ్, బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

సోమవారం నర్మెట్ట మండలంలోని మల్కాపురం, హనుమంతపూర్, బొమ్మకూర్, కన్నబోయిన గూడెం, వెల్దండ తదితర గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇంటింటా కెసిఆర్ అమలుపరిచి అమలుపరచబోయే సంక్షేమ అభివృద్ధి పథకాలతో ప్రచారం నిర్వహించారు. ప్రజలు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement