Monday, April 29, 2024

నాడు డొక్కు సైకిల్‌, విరిగిన కుర్చీలు.. నేడు నిజాంను మించిన ధనవంతులు : రేవంత్ ట్వీట్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందని టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్‌ 21వ ఆవిర్భావ దినోత్సవ సంబురాలు జరుపుకుంటున్న ఆ పార్టీపై రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా తీవ్రంగా స్పందించారు. సీఎం కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేశారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఏర్పాటుతో నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని ఎద్దేవా చేశారు. ‘నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుంచి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించింది. కేసీఆర్‌ కుటుంబం వైభోగం వెనుక ఒక తరం విశాదం ఉంది ‘ అని రేవంత్‌రెడ్డి విమ‌ర్శ‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement