Wednesday, May 8, 2024

స్టూడెంట్ పై కుక్కల దాడి.. తీవ్రగాయాలు

జోగులాంబ గద్వాల  (ప్రభ న్యూస్) :జోగులంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. గద్వాల పురపాలక సంఘం పరిధిలో ఓ విద్యార్థిపై కుక్కలు దాడి చేసాయి. 32 వార్డుకు చెందిన మల్లికార్జున్ ఇంటర్ మొదటి సంవత్సరం చదివుతున్నాడు. ఉదయంఎనిమిది గంటల సమయంలో గద్వాల నుంచి నది అగ్రహారంకు సైకిల్ పై వెళుతుండగా పాత హౌసింగ్ బోర్డ్ వద్ద కుక్కలు దాడి చేశాయి.

దీంతో అతనికి పలుచోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ సమయంలో అటు ఎవరూ లేకపోవడంతో ఐదు కుక్కలు ఒకటేసారి రావడంతో మల్లికార్జున్ గట్టిగానే పోరాడి  దొర్లుకుంటూ రోడ్డు కిందకు దిగి రాళ్లతో కొట్టడంతో కుక్కలు అక్కడి నుంచి వెళ్లినట్లు తండ్రి శ్రీనివాసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement