Friday, May 17, 2024

దళారులను నమ్మి మోసపోవద్దు

ఆదివాసీలు ద‌ళారుల‌ను న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని తుండుందెబ్బ మండ‌ల కార్య‌ద‌ర్శి వ‌జ్జ ర‌వి అన్నారు. వైన్ షాపుల టెండర్లలో బినామీ వ్యాపార దళారులను నమ్మి ఆదివాసీలు కులం, ఏజెన్సీ, తదితర ధ్రువీకరణ పత్రాలను ఇవ్వకూడదని అన్నారు. బినామీలు ఆదివాసీలకు అందవలసిన రాయితీలను అందకుండా చేస్తూ ఆదివాసీలను ఆర్థికంగా మోసం చేస్తున్నారని వైన్ షాపులను ఏళ్ల తరబడి అక్రమ సంపాదన కోసం ఆదివాసీలను ఉపయోగించుకుంటున్న బినామీ వ్యాపార దళారీలు ఆదివాసీల హక్కులను కాలరాసే విధంగా ఇటీవల చేసిన కుట్రలను పరిగణలోకి తీసుకొని ఆదివాసీల పట్ల అప్రమత్తం కావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ సమావేశంలో కుంజ నర్సింగరావు, వాసం వెంకన్న, సువర్ణపాక వెంకట రత్నం, ఇర్ప సంపత్, సోలం వెంకన్న, జోగ వెంకటేష్, తాటి వీరభద్రంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement