Sunday, April 28, 2024

డికె అరుణ అరెస్ట్ – జాతీయ ర‌హ‌దారిపై బిజెపి శ్రేణులు బైఠాయింపు

నిర్మల్ ప్రతినిధి ఆగస్టు 20 ప్రభా న్యూస్ – నిర్మల్ జిల్లా నిర్మల్ పట్టణంలోని మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్ జీవో 24 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న బిజెపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న మాజీమంత్రి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ‌ను సోన్ మండల కేంద్రంలోని గోదావరి బ్రిడ్జి వద్ద అడ్డుకొని అరెస్టు చేసి నిజామాబాద్ జిల్లా మెండోరా పోలీస్ స్టేషన్ కు తరలించడాన్ని నిరసిస్తూ బిజెపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఇంటి నుండి ర్యాలీ నిర్వహించారు.

నేషనల్ హైవే 44 పై గాజులపేట్ వద్ద భారీ ధర్నా రాస్తారోకో నిర్వహించారు . దీంతో పెద్దఎత్తున రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. డీకే అరుణను విడుదల చేసి నిర్మల్ పంపించేంత వరకు ధర్నా రాస్తారోకో విరమించేది లేదని బైఠాయించారు . ఆర్డీవో ఆఫీస్ ఎదుట రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా బీజేపీ చేనులో ఆందోళనలు అద్భుతం భారీ పోలీసు బందోబస్తు మధ్యఎక్కడికి అక్కడ బిజపి కార్యకర్తల అరెస్టులు

Advertisement

తాజా వార్తలు

Advertisement