Sunday, May 19, 2024

RR : కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం.. జిల్లా కాంగ్రెస్ కిసాన్ సెల్​ అధ్యక్షులు రత్నారెడ్డి

వికారాబాద్, నవంబర్ 11 (ప్రభ న్యూస్): రాబోయే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు రెడ్డి పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని ఎన్నేపల్లి మూడో వార్డులో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగులపల్లి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు జై వెంకట్ రెడ్డి నేతృత్వంలో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా రత్నారెడ్డి మాట్లాడుతూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానం సాధించి విజయం సాధిస్తుందని వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ భారీ మెజార్టీతో వికారాబాద్లో విజయం సాధించడం తద్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివానంద్, మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు సర్ఫరాజ్, నాయకులు భూపాల్ రెడ్డి నారాయణ, మేనక శ్రీనివాస్ ముదిరాజ్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement