Friday, May 3, 2024

TS | ఫెయిల్ అయ్యాన‌నే మ‌న‌స్తాపం.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో దారుణం జ‌రిగింది. మెడిపెల్లి మండలానికి చెందిన ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవ్వాల (మంగ‌ళ‌వారం) వచ్చిన ఇంటర్మీడియట్ ఫలితాలలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో బొడ్డుపెళ్లి అభిషేక్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇలాంటి నిర్ణయం మరే విద్యార్థి తీసుకోవద్దని, కుటుంబ సభ్యులకు తోడుగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. ఫెయిల్​ కావడం అనేది పెద్ద సమస్య కాదని, మళ్లీ పరీక్ష రాసి సత్తా చాటుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ చదువులో వీక్​ అయితే.. మరే ఇతర పనిలో అయినా చేరి తల్లిదండ్రులకు, దోస్తులకు దగ్గరగా ఉండే అవకాశాన్ని ఎంచుకోవావలని సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement