Sunday, April 28, 2024

TS: బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లులపై.. మంత్రి పొన్నంతో చర్చలు..

సిరిసిల్ల, ఏప్రిల్ 8 (ప్రభన్యూస్) : మాజీ ఎమ్మెల్సీ చెరుపెల్లి సీతారాములు, కూరపాటి రమేష్ ల ఆధ్వర్యంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ నాయకులు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ను సోమవారం కలిసి వారి నివాసంలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సానుకూలంగా స్పందించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్ లో మాట్లాడి ప్రతినిధులను ప్రజా భవన్ కు తీసుకొని వెళ్లి సమస్యలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో మాట్లాడారు.

భట్టి విక్రమార్క పెండింగ్ బిల్లులను క్లియర్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో జరిగిన చర్చలలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్లకు వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తారని జేఏసీ నాయకులు తెలిపారు. ఈ భేటీలో చెరుపల్లి సీతారాములు, కూరపాటి రమేష్ తో పాటు సిఐటియు నాయకులు మూషo రమేష్, సీపీఐ నాయకులు పంతం రవి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement