Tuesday, May 7, 2024

Breaking: రేవంత్ రెడ్డిని కలిసిన డీజీపీ..

తెలంగాణ ఎన్నికల ఫలితాల ట్రెండ్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం, ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం కనిపించడంతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసేందుకు నేతలు క్యూ కడుతున్నారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ యాదవ్, తన సహోద్యోగులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

బొకే ఇచ్చి రేవంత్ కు అభినందనలు తెలిపారు. రేవంత్ ను కలిసిన వారిలో సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ కూడా ఉన్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement