Monday, April 29, 2024

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు – బీఆర్‌ఎస్‌తోనే ప్రజలకు మేలు…పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి, ఆగస్టు 13 (ప్రభన్యూస్‌): అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణలో పాలన సాగిస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దపల్లి మండలం పెద్ద బొంకూర్‌ గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గులాబీ గూటిలో చేరగా, ఎమ్మెల్యే దాసరి కండువా కప్పి ఆహ్వానించారు.

అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీతోనే పేద ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో పథకాలు అమలు చేయడంతోపాటు అభివృద్ధిలో తెలంగాణను సీఎం కేసీఆర్‌ నంబర్‌ వన్‌గా నిలిపారన్నారు. రానున్న రొజుల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు తప్ప ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదన్నారు. కాగా, పార్టీలో చేరిన వారిలో కల్వల లచ్చయ్య, తగరం మధునయ్య, కల్వల ఓదెలు, రామరాజు, మల్లెష్‌, కనకయ్య, సదయ్య, రాకేష్‌, అంజయ్య, అంజన్‌ ప్రసాద్‌, లక్ష్మయ్య, రవి, శంకర్‌, శ్రావణ్‌, వెంకటేష్‌, శంకరయ్య, ఆంజనేయులు, పోచయ్య, నవీన్‌, శ్రీనివాస్‌, భరత్‌లు ఉన్నారు.

ఈకార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్‌, సర్పంచ్‌ సంపత్‌, మాజీ సర్పంచ్‌ సరోత్తం రెడ్డి, ఉప సర్పంచ్‌ కల్వల సంపత్‌, వార్డు సభ్యులు కలవేన రాయమల్లు, బొడ్డుపెల్లి రాజేశం, తోటపల్లి సంపత్‌, నాయకులు మిట్టపెళ్లి నరేష్‌, మల్లారపు రాకేష్‌, కల్వల భీమయ్య, బీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement