Wednesday, May 1, 2024

ఎంసెట్ లో ర్యాంక్ రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కనగల్‌ మండలంలోని శాబ్దుల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. తెలంగాణలో బుధవారం ఎంసెట్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఎంసెట్‌లో అర్హత సాధించలేదన్న మనస్తాపంతో స్నేహా(16) అనే విద్యార్థిని ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీకు నా మొహం చూపించలేను. మీరు నామీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ నేను నిలబెట్టుకోలేకపోయాను. అందుకే మిమ్మల్ని వదలి వెళ్తున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసింది. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement