Sunday, April 28, 2024

తెలంగాణ‌లో రాక్ష‌స పాల‌న : రేవంత్ రెడ్డి

తెలంగాణలో రాక్షసపాలన నడుస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ గుండెపోటుతో మరణించడం తెలిసిందే. జైత్రం నాయక్ కుటుంబాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీవో నెం.317ని అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్, బీజేపీ రాజకీయ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండూ సమస్యను మరింత జటిలం చేసి లబ్ది పొందాలనుకుంటున్నాయని పేర్కొన్నారు. జీవో నెం.317ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులోనూ దీనిపై పోరాటం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైత్రం నాయక్ చనిపోయి నెలరోజులు అవుతున్నా ప్రభుత్వం తరఫు నుంచి పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. ఈరోజు తాను పరామర్శకు వస్తే పోలీసులతో నిర్బంధించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement